ఒక్కప్పుడు టాలీవుడ్‌కి ‘లక్కీ చామ్‌’ అనిపించి.. ఇప్పుడు వివాదాల మాటలతో అప్పుడప్పుడూ గుర్తు వస్తున్న ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్ సింగ్. ఆమె తాజాగా అబార్షన్‌పై చేసిన కామెంట్లు కలకలం రేపుతున్నాయ్!

రకుల్ ఏమంటుంది అంటే —

“అనుకోకుండా ప్రెగ్నెన్సీ వస్తే చాలామంది అబార్షన్ చేసుకోమంటారు. ఎంత సులభంగా ఈ మాట చెబుతున్నారో కానీ, అసలు ఆ తల్లికి పడే శారీరక, మానసిక, భావోద్వేగ నొప్పిని ఎవ్వరూ ఊహించలేరు. స్కిన్ లేయర్ పీల్ చేస్తే ఎంత బాద్యతుందో ఊహించండి… అయితే జీవాన్ని శరీరం నుంచి తీసేయడమంటే ఆ బాధ పదిరెట్లు ఎక్కువ.

ఆడవారి శరీరం సైంటిఫిక్‌గా కేవలం రెండు మిస్‌క్యారేజ్‌లను భరించగలదు. కానీ నేటి యూత్‌లో చాలామంది మూడు నాలుగు అబార్షన్లు కూడా చేయించుకుంటున్నారు. ఇది అత్యంత ప్రమాదకరం. భర్తలు, కుటుంబ సభ్యులు — ఆమె నొప్పిని అర్థం చేసుకుని ఆమెకు మద్దతు ఇవ్వాలి.

ఇతర దేశాల్లో అయితే అబార్షన్ అంటే నేరంగా పరిగణించి జైలుకు పంపిస్తారు. ఇలాంటి చట్టాలు మన దేశంలో కూడా తీసుకురావాలి” అని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.

ఇక ఒక్కప్పుడు తెలుగులో స్టార్ హీరోలందరి సరసన ఓ రేంజ్‌లో వెలిగిన హీరోయిన్‌ రకుల్ ప్రీత్ సింగ్.. మహేష్ బాబు, ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్‌ వంటి టాప్ స్టార్స్‌తో జోడీ కట్టి కుర్రాళ్ల మనసులు దోచింది. మంచి గ్లామర్‌, అద్భుతమైన డాన్స్‌, క్యూట్ యాక్టింగ్‌తో ఓ దశలో టాలీవుడ్‌లో నెంబర్ వన్ హీరోయిన్‌గా గుర్తింపు సంపాదించింది.

కానీ కాలక్రమేణా వరుస ఫ్లాపులతో ఆమె క్రేజ్‌ కాస్త డీలా పడిపోయింది. టాలీవుడ్ నుండి కోలీవుడ్‌, అక్కడి నుంచి బాలీవుడ్‌ వరకూ ప్రయాణం చేసినా — ఏ భాషలలోనూ ఆమెకు మరో ‘బ్రేక్‌’ రాలేదు. ప్రస్తుతం తమిళంలో కొన్ని సినిమాలు లైన్‌లో ఉన్నప్పటికీ.. కెరీర్ పరంగా ఆమె మళ్లీ గట్టిగా ఎదగాలంటే చాలా దూరం ఉంది.

అయితే సినిమాల విషయాలు పక్కన పెడితే.. తాజాగా ఆమె చేసిన కొన్ని వ్యాఖ్యలు మాత్రం బాగా వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా అబార్షన్ గురించి ఆమె చెప్పిన మాటలు నెట్‌జన్లలో చర్చనీయాంశంగా మారాయి.

ఈ వ్యాఖ్యలతో రకుల్ మరోసారి స్పాట్‌లైట్లోకి వచ్చారు. కొందరు ఆమె చెప్పింది నిజమే అంటుంటే, మరికొందరు ఆమె వ్యాఖ్యలు ‘ఎగ్జాజరేషన్’ అంటున్నారు. ఏది ఏమైనా.. ఓ స్టార్ హీరోయిన్‌ ఇలా ఓ సెన్సిటివ్ టాపిక్‌ గురించి తెగ చెప్పడమే హాట్ టాపిక్‌ అయింది.

You may also like
Latest Posts from